Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికలు తుది అంకానికి చేరడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికలు కేవలం మన కోసం కాదని, మన భవిష్యత్ తరాల బాగోగులను నిర్ధేశిస్తాయని సమాజ్వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. యూపీలోని దియోరియాలో మంగళవారం రాహుల్ గాంధీతో కలిసి ప్రచార ర్యాలీలో అఖిలేష్ పాల్గొన్నారు.
కాషాయ పార్టీ కుట్రల నుంచి మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఆయన ఓటర్లకు పిలుపు ఇచ్చారు. ఇక ఈ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ అంబానీ, అదానీలకు సాయం చేయాలని పరమాత్మ నరేంద్ర మోదీని పంపారని ఎద్దేవా చేశారు. రైతులు, కార్మికులకు సేవ చేసేందుకు పరమాత్మ మోదీని పంపలేదని అన్నారు.
నిజంగా పరమాత్మ మోదీని పంపిఉంటే ఆయన పేదలు, రైతులకు సాయపడేవారని చెప్పారు. బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నుల సేవలో మోదీ తరిస్తున్నారని మండిపడ్డారు. పేదల సమస్యలు, ధరల మంట, నిరుద్యోగం వంటి వాస్తవిక అంశాలను కాషాయ నేతలు విస్మరిస్తున్నారని ఆరోపించారు.
Read More :
Dubbaka | అయోధ్య రామయ్య అలంకరణకు దుబ్బాక చేనేత వస్త్రం