Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో మొదలైనా.. ఆ తర్వాత ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ప్రధానరంగాల్లో షేర్లు అమ్మకాలతో మార్కెట్లు నష్టపోయాయి. క్రితం సెషన్తో పోలిస్తే ఉదయం సెన్సెక్స్ 75,585.40 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. మధ్యాహ్నానికి సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ కోలుకోకలేకపోయాయి. ఇంట్రాడేలో 75,585.40 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్.. 75,083.22 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 220.05 పాయింట్ల పతనమైన సెన్సెక్స్.. 75,170.45 వద్ద ముగిసింది.
నిఫ్టీ 44.30 పాయింట్లు పతనమై.. 22,888.15 వద్ద స్థిరపడింది. దాదాపు 1,079 షేర్లు పురోగమించగా, 2272 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్ప్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ప్రైజెస్, బీపీసీఎల్ ఉన్నాయి. దివీస్ లాబొరేటరీస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్ లాభపడ్డాయి. సెక్టోరల్లో ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, టెలికాం, పీఎస్యూ బ్యాంక్, పవర్ అండ్ రియాల్టీ ఒకటి నుంచి రెండుశాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ ఒకశాతం పడిపోయాయి.