Sports
- Feb 06, 2021 , 00:36:07
VIDEOS
విరామం తప్పనిసరి

- బబుల్తో మానసిక అలసట: శాస్త్రి
చెన్నై: బయోబబుల్లో సుదీర్ఘంగా ఉండడం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని టీమ్ఇండియా హెడ్కోచ్ రవిశాస్త్రి అన్నాడు. క్వారంటైన్ లాంటివి మానసిక అలసటకు గురిచేస్తాయని, అందుకే ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత భారత ఆటగాళ్లకు రెండు వారాల విరామం తప్పనిసరిగా ఉండాలని శుక్రవారం ఓ టీవీ షోలో చెప్పాడు. ‘అంతర్జాతీయ క్రికెట్కు ఎప్పుడో ఒక సమయంలో విరామం ఉండాల్సిందే. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత ఐపీఎల్కు వెళ్లాలి. అయితే ఐపీఎల్ అనంతరం రెండు వారాల బ్రేక్ తప్పనిసరి. ఈ క్వారంటైన్లు, బబుల్స్ వల్ల మానసికంగా నీరసం వస్తుంది. అలసిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే మనమంతా మనుషులం. విరామం కచ్చితంగా కావాలి’ అని శాస్త్రి అన్నాడు. అలాగే టీమ్ఇండియా బెంచ్ సామర్థ్యం ఎంతో ఉందని, ప్రతీఒక్కరు సత్తాచాటాలనే ఉత్సాహంతో ఉన్నారని తెలిపాడు.
తాజావార్తలు
- పాటలు పాడే వేణువు సిద్ధం చేసిన గిరిజనుడు.. వీడియో
- టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు అద్భుత స్పందన : మంత్రి కేటీఆర్
- బన్నీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్..‘పుష్ప’ టీజర్కు ముహూర్తం ఫిక్స్
- డ్రగ్ సిండికేట్కు చెక్ : రూ 4 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు సీజ్!
- ఎస్యూవీ కార్లకు ఫుల్ డిమాండ్: ఫిబ్రవరి సేల్స్ మిక్చర్ పొట్లాం!!
- ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి జైలు శిక్ష
- మహిళ ఫిర్యాదుతో ఆప్ ఎమ్మెల్యేపై వేధింపుల కేసు
- సచిన్ ముందే చూడకుండా రుబిక్ క్యూబ్ని సెట్ చేశాడు..వీడియో వైరల్
- ‘4-5 రోజుల తర్వాత మరణిస్తే టీకాతో సంబంధం లేనట్లే..’
- ఝరాసంగం కేజీబీవీలో కరోనా కలకలం
MOST READ
TRENDING