IND vs WI | దుబాయ్: విండీస్ పర్యటనలో భాగంగా తొలి టీ20లో కరీబియన్ల చేతిలో పరాజయం పాలైన టీమ్ఇండియాకు మరో షాక్ తగిలింది. గురువారం జరిగిన పోరులో స్లో ఓవర్ రేట్కు పాల్పడినందుకు గానూ ఐసీసీ.. భారత ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో కోత విధించింది.
నిర్ణీత సమయంలో ఒక ఓవర్ తక్కువ వేయడంతో భారత ఆటగాళ్ల ఫీజులో 5 శాతం కోత విధించింది. వెస్టిండీస్ నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పెట్టింది.