PCB: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి కొత్త చీఫ్ రాబోతున్నాడు. పాక్ జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలో ఇటీవలే అధ్యక్ష బాధ్యతల నుంచి జకా అష్రఫ్ వైదొలిగిన విషయం తెలిసిందే. జకా స్థానాన్ని మోహ్సిన్ నఖ్వీ భర్తీ చేయనున్నాడని సమాచారం. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలిందని పాకిస్తాన్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్ ప్రధాని అన్వర్ ఉల్ హక్ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ నఖ్వీ ఎంపిక ఖాయమైతే పీసీబీకి అతడు 33వ చైర్మన్గా నియమితుడవుతాడు.
ఎవరీ నఖ్వీ..?
మీడియా అధిపతిగా ఉన్న మోహ్సిన్.. రాజకీయ రంగంలోనూ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి ఆయన కేర్టేకర్ సీఎంగా కొనసాగుతున్నాడు. 2023 జనవరి నుంచి ఆయన పంజాబ్ పాలనా బాధ్యతలు చూసుకుంటున్నాడు. ఆయనకు సిటీ 42 పేరిట మీడియా సంస్థలున్నాయి. 2009 నుంచి మీడియా రంగంలో ఉన్న నఖ్వీకి ప్రస్తుతం ఆరు టీవీ ఛానెల్స్, ఒక న్యూస్ పేపర్ కూడా ఉంది.
గత ఏడాదిన్నర కాలంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు నఖ్వీ మూడో చైర్మెన్ అవనున్నాడు. ఇమ్రాన్ ఖాన్ అధికారం కోల్పోయాక నజమ్ సేథీ ఆ పగ్గాలు చేపట్టాడు. గతేడాది జకా అష్రఫ్.. సేథీని తప్పించి ఆ పదవిని దక్కించుకున్నాడు. గతవారం అష్రఫ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
🚨- If #mohsinnaqvi is appointed as PCB chairman, I am afraid that ICC may ban our cricket board like Sri Lanka, because ICC has banned politicians in cricket boards … pic.twitter.com/JHmUVHryGa
— Adv. Mian Omer🇵🇰 (@Iam_Mian) January 22, 2024
అభిమానుల ఆగ్రహం..
తాజాగా పీసీబీకి చీఫ్ కాబోతున్న నఖ్వీ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ క్రికెట్లో ఉన్న సమస్యలను నేను పరిష్కరించేందుకు కృషి చేస్తా. పాక్ క్రికెట్లో భారీ సంస్కరణలు చేపట్టాల్సి ఉంది..’ అని చెప్పడంతో అతడి అభ్యర్థిత్వం ఖరారైనట్టు తెలుస్తోంది. కాగా నఖ్వీని పీసీబీ చీఫ్గా చేయడంపై పాకిస్తాన్ క్రికెట్ మాజీలతో పాటు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పీసీబీని అతడి చేతుల్లో పెడితే భవిష్యత్లో పాకిస్తాన్ క్రికెట్ ఐసీసీ నుంచి నిషేధం ఎదుర్కోవడం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
RIP Pakistan Cricket 🏏 💔#Mohsinnaqvi |#PakistanCricketpic.twitter.com/MsWZXxPzwO
— Ramzan Baloch (@BalochRamzan1) January 22, 2024