హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తాను కాంగ్రెస్ నాయకులు శనివారం కలిసి విన్నవించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సరిపడా భద్రతను పెంచాలని కోరారు. తెలంగాణలో ఎన్నికలు సాఫీగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు డీజీపీకి తెలిపారు.
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎ మ్మెల్సీలు కపిలవాయి దిలీప్కుమార్, రాములునాయక్, మాజీ మంత్రి పుష్పలీల, ప్రొఫెసర్ కత్తి వెంకటస్వా మి, వినోద్రెడ్డి, దివ్యవాణి ఉన్నారు.