ఒలింపిక్స్ హాకీలో ఘన చరిత్రకు చిరునామా అయిన భారత్..పారిస్లో అదిరిపోయే ఆరంభం చేసింది. తమ తొలి పోరులో టీమ్ఇండియా 3-2తో న్యూజిలాండ్పై విజయం సాధించింది. భారత్ తరఫున మన్దీప్సింగ్(24ని), వివేక్సాగర్(34ని), హర్మన్ప్రీత్సింగ్(59ని) గోల్స్ చేశారు. మరోవైపు సామ్లేన్(8ని), సైమన్ చైల్డ్(53ని) కివీస్కు గోల్స్ అందించారు. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా దక్కిన పెనాల్టీ స్ట్రోక్ను హర్మన్ప్రీత్సింగ్ గోల్గా మలిచి భారత్కు విజయాన్నందించాడు.