Paris Olympics 2024 | భారత టేబుల్ టెన్నిస్ జట్లు (పురుషుల, మహిళల) సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఈ ఏడాది జరగాల్సి ఉన్న పారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల, మహిళల జట్లు అర్హత సాధించాయి. ఒలింపిక్స్లో వ్యక్తిగత ఈవెంట్లలో మినహాయిస్తే బృందాలుగా ఆడే ఈవెంట్స్లో భారత జట్లు ఆడనుండటం ఇదే ప్రథమం. ర్యాంకుల ఆధారంగా ఇండియా పారిస్ ఒలింపిక్స్కు క్వాలిఫై అయింది. 2008లో బీజింగ్ ఒలింపిక్స్లో మొట్టమొదటిసారిగా టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్స్ పోటీలను ప్రవేశపెట్టగా భారత్ ఈ పోటీలను ఆడనుండటం ఇదే తొలిసారి కానుంది.
గతనెలలో బుసాన్ వేదికగా ముగిసిన వరల్డ్ టీమ్ ఛాంపియన్షిప్స్లో భారత జట్లు ఫైనల్లో ఓడినా ర్యాంకుల ఆధారంగా భారత్ క్వాలిఫై అయింది. మహిళల ర్యాంకింగ్స్లో భారత్.. 13వ స్థానంలో ఉండగా పురుషుల ర్యాంకింగ్స్లో 15 వ ర్యాంకులో ఉంది. కాగా ఒలింపిక్స్లో మొదటిసారి బరిలోకి దిగబోతున్న భారత జట్టుపై టీటీ దిగ్గజం శరత్ కమాల్ ప్రశంసలు కురిపించాడు.
Historic moment for Indian Table Tennis, as the Men’s Team and Women’s Team have qualified for the Paris Olympics on the basis of their rankings👏 pic.twitter.com/I5eeSJW4eZ
— Dushyant Chautala (@Dchautala) March 4, 2024