Neeraj Chopra : ఒలింపిక్స్లో రజత పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా (Neeraj Chopra) తొలిసారి స్పందించాడు. జావెలిన్ త్రో (Javelin Throw)లో వరుసగా రెండో మెడల్తో యావత్ భారతాన్ని సంతోషంలో ముంచెత్తిన నీరజ్ శనివారం సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తన విజయానందాన్ని అందరితో పంచుకున్నాడు.
‘ఒలిపిక్స్లో దేశం తరఫున మరోసారి పోడియం మీద నిల్చోవడం చాలా గర్వంగా ఉంది. మీ ప్రేమకు, మద్ధతుకు ధన్యవాదాలు. జై హింద్’ అని చోప్రా ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. విశ్వ క్రీడల్లో ఏ భారత అథ్లెట్కు సాధ్యం కాని రికార్డును నీరజ్ చోప్రా సాధించాడు. నాలుగేండ్ల క్రితం టోక్య ఒలింపిక్స్(Tokyo Olympics)లో స్వర్ణంతో మెరిసిన ఈ బల్లెం వీరుడు ఇప్పుడు పారిస్లో వెండి వెలుగులు విరజిమ్యాడు.
ओलंपिक खेलों में भारत के लिए एक और पदक जीतके बहुत अच्छा लगा। इस बार पेरिस में हमारा National Anthem नहीं बज पाया, लेकिन आगे की मेहनत उसी पल के लिए होगी।💪
Very proud to be on the podium for India once again at the Olympic Games. Thank you for the love and support. Jai Hind! 🇮🇳… pic.twitter.com/b2DoatANPn
— Neeraj Chopra (@Neeraj_chopra1) August 10, 2024
క్వాలిఫయింగ్ రౌండ్లో 89.34 మీటర్లతో అదరగొట్టిన నీరజ్ ఫైనల్లో 89. 45మీటర్ల దూరం ఈటెన్ విసిరాడు. అర్షద్ నదీమ్(పాక్) 92.97 మీటర్లతో అగ్రస్థానంలో నిలవగా.. రెండో స్థానం దక్కించుకొని వరుసగా రెండో పతకంతో దేశం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తద్వారా సుశీల్ కుమార్ (రెజ్లింగ్), పీవీ సింధు(బ్యాడ్మింటన్)ల తర్వాత వరుస ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత అథ్లెట్గా నీరజ్ రికార్డు నెలకొల్పాడు.