T20 WC 2024 : పొట్టి క్రికెట్లో పసికూన పపువా న్యూ గినియా(Papua New Guinea) జట్టు సంచలనం సృష్టించింది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ పోటీలకు క్వాలిఫై అయింది. దాంతో, వరల్డ్ కప్ బరిలో నిలిచిన 15వ జట్టు అయింది. తూర్పు ఆసియా పసిఫిక్ క్వాలిఫైయర్(East Asia Pacific Qualifier) పోటీలో పపువా న్యూ గినియా ఈరోజు ఫిలీప్పీన్స్(Philippines) జట్టుపై 100 పరుగుల తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన గినియా టీమ్ 229 రన్స్ కొట్టింది. టీ20ల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఆ తర్వాత ఫిలీప్పీన్స్ను 127 పరుగులకే కట్టడి చేసింది. న్యూ గినియా బౌలర్ కబువా మొరియా(Kabua Morea) హ్యాట్రిక్తో సహా 5 వికెట్లతో చెలరేగాడు.
ICC Men’s #T20WorldCup 2024 bound ✈️🏆
Congratulations, Papua New Guinea! 🙌 pic.twitter.com/Y7jKSU6Hxq
— ICC (@ICC) July 28, 2023
దాంతో, ఆతిథ్య జట్టు 100 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. నిన్ననే స్కాట్లాండ్(Scotland), ఐర్లాండ్ (Ireland) జట్లు పొట్టి ప్రపంచ కప్ పోటీలకు క్వాలిఫై అయ్యాయి. యూరోపియన్ క్వాలిఫైయర్స్లో మెరుగైన రన్రేటు ఉన్న ఈ రెండు జట్లు నేరుగా అర్హత సాధించాయి. ఇప్పటికే అన్ని ప్రధాన జట్లు ఈ పోటీలకు క్వాలిఫై అయ్యాయి. అవేంటంటే..?
వచ్చే ఏడాది జూన్లో టీ20 ప్రపంచ కప్ మొదలవ్వనుంది. ఈ మెగా టోర్నీకి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 15 జట్లు టీ20 వరల్డ్ కప్కి క్వాలిఫై అయ్యాయి. అవేంటంటే..? భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, అమెరికా జట్లు, స్కాట్లాండ్, ఐర్లాండ్, పపువా న్యూ గినియా జట్లు అర్హత సాధించాయి. 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో మరో ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. నిరుడు ఆస్ట్రేలియా వేదికగా జరిగిన పోటీల్లో ఇంగ్లండ్ చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో పాకిస్థాన్పై 5 వికెట్ల తేడాతో గెలిచి రెండో సారి ట్రోఫీ ఎగరేసుకుపోయింది.