బార్బడోస్: ఇండియన్ స్టార్ స్పిన్ బౌలర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లు వన్డేల్లో అరుదైన మైలురాయిని(ODI Milestone) అందుకున్నారు. వన్డే మ్యాచుల్లో ఇద్దరు స్పిన్నర్లు ఏడు లేదా అంతకన్నా ఎక్కువ వికెట్లు తీసుకున్న భారతీయ బౌలర్ల జాబితాలో నిలిచారు. విండీస్తో జరిగిన తొలి వన్డేలో ఇద్దరు కలిసి ఏడు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసుకోగా, జడేజా మూడు వికెట్లను పడగొట్టాడు. ఇద్దరు స్పిన్నర్లు కలిసి ఏడు వికెట్లు తీసుకోవడం 49 ఏళ్ల తర్వాత తొలిసారి అని తెలుస్తోంది. ఈ అరుదైన మైలురాయిపై బీసీసీఐ ట్వీట్ చేసింది.
🚨 Milestone Alert 🚨#TeamIndia pair of @imkuldeep18 (4⃣/6⃣) & @imjadeja (3⃣/3⃣7⃣ ) becomes the first-ever pair of Indian left-arm spinners to scalp 7⃣ wickets or more in an ODI 🔝 #WIvIND pic.twitter.com/F18VBegnbJ
— BCCI (@BCCI) July 27, 2023
విండీస్తో జరిగిన వన్డేలో కుల్దీప్ మూడు ఓవర్లలో ఆరు రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. జడేజా 37 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఇండియా అయిదు వికెట్ల తేడాతో నెగ్గింది.
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో కరీబియన్లను చిత్తుచేసింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ ప్లేయర్లు గల్లీ క్రికెటర్ల తరహాలో పెవిలియన్కు క్యూ కట్టడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు.. 23 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ షై హోప్ (43) టాప్ స్కోరు కాగా.. మయేర్స్ (2), హెట్మైర్ (11), పావెల్ (4), కింగ్ (17) విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 4, జడేజా 3 వికెట్లు పడగొట్టారు.
అనతరం స్వల్ప లక్ష్యఛేదనలో భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 52; 7 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో మెరిశాడు. కుల్దీప్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరుగనుంది.