సిడ్నీ: పాకిస్థాన్ కష్టాల్లో పడింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో పాక్ పవర్ప్లేలో మూడు వికెట్లను కోల్పోయింది. ఆరు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 42 రన్స్ చేసింది పాక్ జట్టు. రిజ్వాన్ నాలుగు రన్స్ చేసి పార్నెల్ బౌలింగ్లో ఔటయ్యాడు. నోర్జా బౌలింగ్లో హరిస్ 28 రన్స్కు నిష్క్రమించాడు. ఇక కెప్టెన్ బాబర్ ఆజమ్ క్రీజ్లో నిలదొక్కుకునేందుకు కష్టపడ్డాడు. కానీ ఎంగిడి బౌలింగ్లో అతను 6 పరుగులకే ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో గెలిస్తేనే పాకిస్థాన్కు సెమీస్ ఆశలు మిగులుతాయి. ఒకవేళ ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా నెగ్గితే అప్పుడు అది సెమీస్ వెళ్లిన తొలి జట్టు అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఏడు ఓవర్లలో పాక్ 4 వికెట్లకు 43 రన్స్ చేసింది.
Powerplay over!
South Africa take charge against Pakistan with three wickets 👊#T20WorldCup | #PAKvSA | 📝: https://t.co/3VVq7VAJLt pic.twitter.com/98ql83tXbq
— ICC (@ICC) November 3, 2022