Athletics Championship | దుబాయ్: ఆసియా అండర్ 20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్ అదరగొట్టింది. 7 స్వర్ణాలు, 11 రజతాలు, 11 కాంస్య పతకాలు సాధించిన భారత్.. 29 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. 1992, 1996 తర్వాత ఈ టోర్నీలో రెండో స్థానంలో నిలవడం భారత్కు ఇదే తొలిసారి.
ఈ క్రీడల్లో చైనా కూడా 29 పతకాలే నెగ్గినా ఆ జట్టు 16 స్వర్ణాలు గెలవడంతో అగ్రస్థానాన నిలిచింది. కాగా ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన యువ అథ్లెట్ దొడ్ల సాయి సంగీత.. 4X400 రిలేలో స్వర్ణం గెలుచుకుంది. అనుష్క, జయవింధ్య, దేవ శేఖర్లతో పాటు సంగీత.. పసిడి నెగ్గింది.