మేడ్చల్, ఏప్రిల్ 28 : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులు మూడుచింతపల్లి మండలం కొల్తూర్లో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి పోస్టుకార్డులను పంపారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే రైతులను సమస్యలు చుట్టిముట్టాయన్నారు. మాటి మాటికీ కరెంటు పోతున్నదని, బోర్లు కాలిపోతున్నాయని, పంటలు ఎండిపోతున్నాయని, రైతుబంధు రావడం లేదన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే గత సమస్యలు పునరావృతమవుతాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరెంటు సమస్య తలెత్తలేదని, బోర్లు కాలిపోయి, పంటలు ఎండిపోయిన దాఖలాలు లేవన్నారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి, సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు గౌస్ పాష, పీఏసీఎస్ డైరెక్టర్ భిక్షపతి, రైతులు శ్రీకాంత్ రెడ్డి, దయాకర్, అనిల్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ఆంజనేయులు, గోపాల్, బావూసింగ్, విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.