లాహోర్: కెప్టెన్ బాబర్ అజామ్ (58 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లోనూ పాక్ విజయం సాధించింది.
రెండో మ్యాచ్లో 38 పరుగులతో నెగ్గిన పాక్.. ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో ముందంజ వేసింది. తొలుత పాకిస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. బాబర్ శతక్కొట్టగా.. రిజ్వాన్ (50) హాఫ్సెంచరీతో రాణించాడు. అనంతరం న్యూజిలాండ్ 7 వికెట్లకు 154 పరుగులు చేసింది.