IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) 17వ సీజన్ మరో నెల రోజుల్లో తెరలేవనుంది. దాంతో, అన్ని ఫ్రాంచైజీలు టైటిల్ వేట కోసం వ్యూహాలు పన్నతున్నాయి. ఈ సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా(Krunal Pandya)కు షాకిస్తూ.. వెస్టిండీస్ చిచ్చరపిడుగు నికోలస్ పూరన్(Nicholas Pooran)ను వైస్ కెప్టెన్గా నియమించింది.
కెప్టెన్ కేఎల్ రాహుల్, పూరన్ కలిసి ఉన్న ఫొటోను గురువారం లక్నో మేనేజ్మెంట్ తమ ఎక్స్ పోస్ట్ చేసింది. అందులో ఈ స్టార్ ఆటగాళ్లు లక్నో జెర్సీతో పోజిచ్చారు. దానికి ‘రాహుల్, పూరన్ .. ఈ సీజన్ ఎంతో ప్రత్యేకంగా ఉండనుంది’ అంటూ క్యాప్షన్ రాసింది.
KL Rahul (C)
Nicholas Pooran (VC)This season feels special already 💙 pic.twitter.com/367JTTeSHL
— Lucknow Super Giants (@LucknowIPL) February 29, 2024
ఐపీఎల్ 16వ సీజన్లో రాహుల్ ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడి టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దాంతో, వైస్ కెప్టెన్గా ఉన్న కృనాల్ పాండ్యా సారథిగా జట్టును నడిపించాడు. లక్నోను ఏకంగా ప్లే ఆఫ్స్కు తీసుకెళ్లాడు. కానీ, నాకౌట్ పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో లక్నో చేజేతులా ఓటమి పాలైంది. మరోవైపు.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్(ILT20)లో పూరన్ కెప్టెన్గా నిరూపించుకున్నాడు. బ్యాటర్గా, సారథిగా రాణించి ఎంఐ ఎమిరేట్స్(MI Emirates)ను తొలిసారి చాంపియన్గా నిలిపాడు.
పూరన్, కృనాల్ పాండ్యా
అందుకనే 17వ సీజన్లో లక్నో పూరన్కు వైస్ కెప్టెన్సీ అప్పగించింది. ఒకవేళ రాహుల్ తొలి షెడ్యూల్లో కొన్ని మ్యాచ్లకు దూరమైనా.. పూరన్ కెప్టెన్గా జట్టును నడిపించే చాన్స్ ఉంది.టీ20లీగ్స్లో పాపులర్ అయిన ఐపీఎల్ 16 సీజన్లుగా ఫ్యాన్స్ను అలరిస్తోంది. ఈసారి కూడా స్వదేశంలోనే ఈ మెగా టోర్నీ జరుగనుంది. మార్చి 22వ తేదీన ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.