Hyderabad | హైదరాబాద్, ఆట ప్రతినిధి: నితీశ్ రెడ్డి (122; 13 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రజ్ఞయ్ రెడ్డి (102 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో కదంతొక్కడంతో మేఘాలయతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ ఫైనల్లో హైదరాబాద్ మంచి స్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 25/2తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 350 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ తిలక్ వర్మ (44) రాణించాడు. అంతకుముందు మేఘాలయ తొలి ఇన్నింగ్స్లో 304 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ జట్టు ఆట నిలిచే సమయానికి పరుగులేమీ చేయకుండా ఒక వికెట్ కోల్పోయింది.