భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్.. బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో కూడా సత్తా చాటుతోంది. ప్రపంచ మహిళా ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్.. మహిళల ఫ్లైవెయిట్ విభాగంలో అద్భుతంగా రాణించి ఫైనల్ చేరింది. 26 ఏళ్ల ఈ పంచ్ల రాణి.. సెమీఫైనల్లో ఇంగ్లండ్కు చెందిన సవన్నా స్టబ్లేపై విజయం సాధించింది. దీంతో ఫైనల్ చేరినా నిఖత్.. కనీసం సిల్వర్ మెడల్ ఖరారు చేసుకుంది. ఫైనల్లో గెలిస్తే ఏకంగా స్వర్ణం తన ఖాతాలో వేసుకుంటుంది. మరోపక్క భారత బాక్సర్లు అమిత్ పంఘాల్, నీతూ గాంఘాస్ కూడా తమ తమ కేటగిరీల్లో ఫైనల్ చేరారు.