చాటోగ్రామ్: ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండవ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 513 పరుగల టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నాలుగవ రోజు భోజన విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 119 రన్స్ చేసింది. ఓపెనర్లు నజ్ముల్ హుస్సేన్ షాంతో, జకీర్ హసన్.. హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. బంగ్లా గెలుపు కోసం ఇంకా 394 రన్స్ చేయాల్సి ఉంది. పిచ్లో పస తగ్గిపోవడంతో.. భారత పేస్ బౌలర్లు ఇబ్బందిపడుతున్నారు. స్పిన్కు పిచ్ అనుకూలిస్తున్నా.. బంగ్లా ఓపెనర్లు మాత్రం ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఇవాళ లంచ్ సమయానికి షాంతో 64, జకీర్ 55 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 150 రన్స్కే ఆలౌటైంది. ఇండియా తొలి ఇన్నింగ్స్లో 404 రన్స్ కు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 258 రన్స్ చేసి డిక్లేర్ చేసింది.
Bangladesh 150 & 119/0 at Lunch on Day 4 of the 1st Test.
Scorecard – https://t.co/GUHODOYOh9 #BANvIND pic.twitter.com/M6BE8IG3D3
— BCCI (@BCCI) December 17, 2022