MI vs UPW : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) విజయాల పరంపర కొనసాగుతోంది. హర్మన్ప్రీత్ (Harmanpreet) సేన వరుసగా నాలుగో మ్యాచ్లోనూ గెలిచింది. యూపీ వారియర్స్ (UP Warriorz)పై 8 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. హర్మన్ప్రీత్ కౌర్(53) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించింది. నాట్ సీవర్ బ్రంట్ (45) ధాటిగా ఆడి ఆమెకు సహకారం అందించింది. వీళ్లు మూడో వికెట్కు రన్స్ జోడించారు.
160 టార్గెట్తో బ్యాటింగ్కు దిగిన ముంబైకి ఓపెనర్లు యస్తికా భాటియా (42), హేలీ మాథ్యూస్ (12) శుభారంభం ఇచ్చారు. పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. అయితే.. ఓపెనర్లు హేలీ మాథ్యూస్, యస్తిక వెంట వెంటనే ఔటయ్యారు. సోఫీ ఎక్లెస్టోన్, రాజేశ్వరీ గైక్వాడ్ తలా ఒక వికెట్ తీశారు.
హర్మన్ప్రీత్ కౌర్ క్రీజులోకి వచ్చే సరికి ముంబై ఇండియన్స్ స్కోర్.. 58\2. దాంతో, నాట్ సీవర్ బ్రంట్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించింది. సింగిల్స్, డబుల్స్తో మొదలుపెట్టి కుదురుకున్నాక విరుచుకుపడింది. యూపీ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దూకుడుగా ఆడితూ ఈ లీగ్లో రెండో ఫిఫ్టీ నమోదు చేసింది. కెప్టెన్ కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆమె 33 బంతుల్లో 9 ఫోర్లు ఒక సిక్సర్తో 53 పరుగులు చేసింది. నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించింది.
మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు కొట్టింది. ఓపెనర్ అలిసా హేలీ (58), తహ్లియా మెక్గ్రాత్ (50) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీళ్ల జోరు చూస్తుంటే యూపీ 200 ప్లస్ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ, ముంబై స్పిన్నర్ సాయిక్ ఇషాక్ కీలక వికెట్లు తీసి యూపీని దెబ్బ కొట్టింది. యూపీ బ్యాటర్లలో కిరణ్ నవ్గరే (17) మరోసారి నిరాశ పరిచింది. చివర్లో సిమ్రాన్ షేక్ (9), దీప్తి శర్మ (7) పోరాటంతో యూపీ 150 ప్లస్ స్కోర్ చేయగలిగింది. ముంబై బౌలర్లలో సాయిక్ ఇషాక్ మూడు, హేలీ మాథ్యూస్ రెండు వికెట్లు తీశారు. అమేలియా కేర్ ఒక వికెట్ పడగొట్టింది.