Nathan Lyon : ఆస్ట్రేలియా (Australia) ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్ (Nathan Lyon) మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (Border – Gavaskar Trophy)లో చెలరేగుతున్న అతను 41 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టాడు. భారత గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన విదేశీ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ ఆఫ్ స్పిన్నర్ భారత్లో 55 వికెట్లు పడగొట్టాడు. అహ్మదాబాద్లో జరుగుతున్న టెస్టులో రెండో వికెట్ తీసిన అనంతరం లియాన్ ఈ మైలురాయికి చేరువయ్యాడు. ఇంతకుముందు ఈ రికార్డు డెరెక్ అండర్వుడ్ (ఇంగ్లండ్) పేరిట ఉంది. భారత గడ్డపై 16 టెస్టులు ఆడిన డెరెక్ 54 వికెట్లు తీశాడు.
లియాన్ 11 టెస్టుల్లోనే అతని రికార్డు బ్రేక్ చేయడం విశేషం. నాలుగో టెస్టులో శుభ్మన్ గిల్ (Shubaman Gill), కేఎస్ భరత్, అశ్విన్లను లియాన్ ఔట్ చేశాడు. ఇండోర్ టెస్టూలో లియాన్ 11 వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టు నాలుగో రోజు టీమిండియా జోరు కొనసాగించింది. విరాట్ కోహ్లీ (186) సెంచరీ, అక్షర్ పటేల్ (79) హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 571 పరుగులకు ఆలౌట్ అయింది. 91 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. ఇంకా ఆ జట్టు 88 పరుగులు వెనబడి ఉంది. నైట్వాచ్మన్ మాథ్యూ కునేమాన్ (0), ట్రావిస్ హెడ్ (3) క్రీజులో ఉన్నారు.