అహ్మదాబాద్: విరాట్ స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అయినా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఆయన సెంచరీ కొట్టాడని కోహ్లీ భార్య అనుష్క శర్మ తన ఇన్స్టా ఖాతాలో మెచ్చుకుంది. అంతేకాదు ఆయన ఎప్పుడూ నాకు స్ఫూర్తినిస్తాడని పొగిడేసింది.
‘విరాట్ కోహ్లీ ఆరోగ్యం బాగా లేకపోయినా ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేశాడు. ఆయన నాకెప్పుడూ స్ఫూర్తినిస్తుంటాడు’ అని అనుష్క తన ఇన్స్టా స్టోరీస్లో రాసింది.
కాగా, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. భారత తొలి ఇన్నింగ్స్లో భాగంగా మొత్తం 364 బంతులను ఎదుర్కొని 186 పరుగులు చేశాడు. అందులో బౌండరీల ద్వారా 60 పరుగులు (15 x 4) వచ్చాయి. అయితే, కోహ్లీ టెస్టు క్రికెట్లో సెంచరీ చేసి నేటికి సరిగ్గా 1204 రోజులు అయ్యింది.