IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్కు మరో మూడు రోజులే ఉంది. అయినా సరే ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) అభిమానుల ఆగ్రహానికి గురవుతూనే ఉన్నాడు. సోషల్మీడియాలో ముంబై ఫ్యాన్స్ అతడిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సోమవారం పాండ్యా, హెడ్కోచ్ మార్క్ బౌచర్(Mark Boucher) ప్రెస్ కాన్ఫరెన్స్ అనంతరం ముంబై ఫ్యాన్స్ ఆగ్రహం తారా స్థాయికి చేరింది. రోహిత్తో మాట్లాడే సమయమే దొరకలేదని పాండ్యా చెప్పడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది.
అప్పటికే రోహిత్ను కెప్టెన్గా తప్పించడంపై గుర్రుగా ఉన్న ఫ్యాన్స్ సోషల్మీడియాలో పాండ్యాపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఫ్రాంచైజీకి ఐదు ట్రోఫీలు కట్టబెట్టిన రోహిత్ను కాదని, పాండ్యాను సారథిగా ఎంపిక చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా ‘రిప్హార్దిక్పాండ్యా’ అంటూ పోస్టులు పెడుతున్నారు. దాంతో, రిప్హార్దిక్పాండ్యా హ్యాష్ట్యాగ్ నెట్టింటట్రెండ్ అవుతోంది.
Never mess up with Rohit Sharma’s fans 🏌️
Rip Hardik pandya pic.twitter.com/32q7Klr0M5
— Appu 😎 (@AppuRj18) March 19, 2024
No #RohitSharma fans will pass without liking this post ❤️
👇👇 RIP HARDIK PANDYA
#ElvishAmry
pic.twitter.com/jB0Sm8Q36U— फ़ितूर (@cricket_adda_) March 19, 2024
పదిహేడో సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ట్రేడింగ్ పద్ధతిలో గుజరాత్ టైటాన్స్ నుంచి పాండ్యాను కొన్నది. అంతేకాదు ముంబై ఫ్యాన్స్ ఆందోళనను నిజం చేస్తూ.. రోహిత్ను తప్పించి పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. దాంతో, హిట్మ్యాన్ అభిమానలు ముంబై మేనేజ్మెంట్, పాండ్యాను టార్గెట్ చేస్తూ.. ఆన్లైన్లో పోస్ట్లు పెట్టారు.
This entry of Rohit Sharma is bigger than entire career of Hardik pandya.👽🫥
RIP HARDIK PANDYA pic.twitter.com/rYULmKoFh3
— Appu 😎 (@AppuRj18) March 19, 2024
పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడం క్రికెట్ నిర్ణయమని బౌచర్ తెలిపాడు. అయినా సరే ముంబై ఫ్యాన్స్ శాంతించలేదు. రోహిత్ భార్య రితిక కూడా బౌచర్ చెప్పిందంతా అబద్దమని, రోహిత్పై కుట్ర జరిగిందని పోస్ట్లు పెట్టింది. 17వ సీజన్లో ముంబై తొలి పోరులో మార్చి 24న గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది.