MS Dhoni | టీమ్ ఇండియా (Team India) మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కొత్త ఏడాది వేడుకల్లో (New Year Celebrations) సందడి చేశారు. ప్రస్తుతం దుబాయ్ (Dubai) వెకేషన్లో ఉన్న ధోనీ.. భార్య సాక్షి సింగ్ (Sakshi Singh), కూతురు జీవాతో కలిసి కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ జరిగిన న్యూఇయర్ పార్టీకి ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో కలిసి హాజరైన ధోనీ తన విలువైన సమయాన్ని సరదాగా గడిపారు. ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సాక్షి సింగ్ ధోనీ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ధోనీకి కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.
మైదానంలో తన బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకున్న ధోనీ.. ప్రస్తుతం క్రికెట్కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కేవలం ఐపీఎల్ (IPL) సీజన్లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ధోనీ నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్లో ఉంటున్నాడు.
Also Read..
Leopard | అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన చిరుత.. వీడియో
Arvind Kejriwal | ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి