MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni ) ఐపీఎల్ కెరీర్పై అభిమానుల్లో చర్చ నడుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ప్లే ఆఫ్స్ చేరకపోవడంతో రాంచీకి వెళ్లిపోయిన ధోనీ అక్కడ బైక్ నడుపుతూ కనిపించాడు. అయితే.. ఈ సమయంలోనే ధోనీ గురించిన షాకింగ్ న్యూస్ ఒకటి మీడియాలో చక్కర్లు కొడుతోంది. కండరాల చీలిక (Muscle Tear) కారణంగా ధోనీ త్వరలోనే లండన్ వెళ్లనున్నాడని, అక్కడే సర్జరీ చేయించుకుంటాడనే వార్త అవుతోంది. అయితే.. ఈ విషయాన్ని అటు తాలాగానీ, సీఎస్కేగానీ అధికారికంగా వెల్లడించలేదు.
ఐపీఎల్ సందర్భంగా ధోనీ కండరాల చీలికతో బాధపడ్డాడు. వైజాగ్లో మ్యాచ్ తర్వాత కాలికి ఐస్ ప్యాక్ పెట్టుకొని కనిపించాడు. అయినా సరే గాయాన్ని లెక్కచేయకుండా జట్టు కోసం బరిలోకి దిగాడు. ‘సీఎస్కే ప్లే ఆఫ్స్ నుంచి వైదొలగడంతో చికిత్స కోసం ధోనీ త్వరలోనే లండన్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. అక్కడే అతడు సర్జరీ చేయించుకోనున్నాడు. ప్రస్తుతానికి అతడు పూర్తిగా ఫిట్గా లేడు. సర్జరీ తర్వాత ధోనీ తన భవిష్యత్పై ఓ నిర్ణయానికి రానున్నాడు. ఆపరేషన్ అనతంరం మహీ కోలుకునేందుకు కనీసం ఐదు నుంచి ఆరు నెలలు పట్టనుంది’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Then. Now and the Forever emotion! 🦁💛#EndrendrumYellove 💛♾️ @msdhoni @Ruutu1331 pic.twitter.com/JpElPv4cyT
— Chennai Super Kings (@ChennaiIPL) May 19, 2024
చెన్నై సూపర్ కింగ్స్కు ఐదు ట్రోఫీలు కట్టబెట్టిన మహీ భాయ్ పదిహేడో సీజన్లో కెప్టెన్సీ వదిలేశాడు. రుతురాజ్ గైక్వాడ్ను తన వారసుడిగా ప్రకటించిన మహీ 41 ఏండ్ల వయసులోనూ వికెట్ల వెనకాల చురుకుగా కనిపించాడు. కెరీర్లో చివరి ఐపీఎల్ ఆడుతున్నాడనే వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్ ధోనీని చూసేందుకు ఎగబడ్డారు.
The Classic Duo! 🦁
Thala 🤝🏻 Thalapathy
6️⃣1️⃣(2️⃣7️⃣) #RCBvCSK #WhistlePodu pic.twitter.com/7BAhwa5f8K— Chennai Super Kings (@ChennaiIPL) May 19, 2024
ఈ క్రికెట్ దిగ్గజం బ్యాటింగ్కు వచ్చిన ప్రతిసారి ధోనీ.. ధోనీ నినాదాలతో స్టేడియాలు హోరెత్తిపోయాయి. అభిమానుల మద్దతుతో రెచ్చిపోయిన మహీ.. ఆఖరి ఓవర్లలో సిక్సర్ల మోత మోగించాడు. అయితే.. మే 19న చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లో సిక్సర్ బాది ఔటయ్యాడు. అంతే.. 27 పరుగులతో గెలుపొందిన బెంగళూరు ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంది.