Paayal Rajput | రక్షణ (Rakshana) సినిమా విషయం ఇప్పుడు టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన విషయం తెలిసిందే. పాయల్ రాజ్పుత్ నిర్మాతల వేధింపుల గురించి ప్రస్తావిస్తూ.. 2019-2020లో రక్షణ సినిమా షూట్ చేశారు. ఈ మూవీ ఒరిజినల్ టైటిల్ 5Ws.. కాగా విడుదల ఆలస్యమైంది. ఇప్పుడు నిర్మాతలు నా పెండింగ్ బకాయిలను చెల్లించకుండానే ప్రమోషనల్ క్యాంపెయిన్లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తూ.. లాభాలు పొందాలని చూస్తున్నారు.
మేకర్స్ తెలుగు సినీ పరిశ్రమ నుంచి నన్ను నిషేధించాలని చూస్తున్నారు. నా రెమ్యునరేషన్ను సెటిల్ చేయకుండానే.. నా అనుమతి లేకుండా సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. దీనిపై మేము న్యాయపరంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నామని పాయల్ రాజ్పుత్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రక్షణ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ శ్రీ సందీప్ ఠాకూర్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో పాయల్ రాజ్పుత్పై ఫిర్యాదు చేశారు. పాయల్రాజ్పుత్కు తమ దగ్గర నుంచి పెండింగ్లో ఉన్న రూ.6 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీగా ఉన్పప్పటికీ సినిమా ప్రమోషన్స్లో పాల్గొనేందుకు ఆమె సహకరించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజా ఫిర్యాదు నేపథ్యంలో పాయల్ రాజ్పుత్కు, మేకర్స్ కు మధ్య వివాదం ఎక్కడి వరకు వెళ్తుందనేది చూడాలి మరి.
Producer & Director Sri Prandeep Thakore gave a complaint on his film “Rakshana” Heroine and Lead artist Ms. Payal Rajput at Telugu Film Producers Council @tfpcin #PayalRajput pic.twitter.com/QwZDIg0F5F
— BA Raju’s Team (@baraju_SuperHit) May 20, 2024