MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కి వీరాభిమాని గోపి కృష్ణన్(Gopi Krishnan) ఆత్మహత్య చేసకున్నాడు. 34 ఏండ్ల వయసులోనే సూసైడ్ చేసుకొని అందర్నీ షాక్కు గురి చేశాడు. తమిళనాడులో కడ్డలోర్ జిల్లాలో ఉన్న అరంగూర్ గ్రామంలోని సొంత ఇంట్లో సాయంత్రం 4:30 గంటకు తనువు చాలించి కుటుంబంలో విషాదం నింపాడు. గతంలో కొందరితో ఆర్థిక లావాదేవీల విషయమై జరిగిన గొడవలే కృష్ణన్ ఆత్మహత్యకు దారి తీసి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మా అన్నయ్యకు పక్క ఊరివాళ్లతో ఆర్థికపరమైన గొడవలు ఉన్నాయి. ఈమధ్యే వాళ్లతో జరిగిన గొడవలో అన్నయ్య గాయపడ్డాడు. ఆ సంఘటనను అతడు చాలా అవమానంగా భావించాడు అని ఓ టీవీ చాన్ల్కు కృష్ణన్ సోదరుడు రాము చెప్పాడు.
Super Fan Gopi Krishnan and his family in Arangur, Tamil Nadu call their residence Home of Dhoni Fan and rightly so. 🦁💛
A super duper tribute that fills our hearts with #yellove. #WhistlePodu #WhistleFromHome pic.twitter.com/WPMfuzlC3k
— Chennai Super Kings (@ChennaiIPL) October 13, 2020
క్రికెట్ను ఎంతో ఇష్టపడే కృష్ణన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు, ధోనీకి వీరాభిమాని. సీఎస్కే, మహీ భాయ్పై ఉన్న అభిమానంతో 2020లో తన ఇంటికి మొత్తానికి అతడు పసుపు రంగు వేయించాడు. ఇల్లంతా సీఎస్కే జెర్సీ రంగుతో చూడముచ్చటగా తీర్చి దిద్దాడు.అంతేకాదు హోమ్ ఆఫ్ ధోనీ ఫ్యాన్ అని ఇంటి ముందు రాయించాడు.
గోపి కృష్ణన్ ఇంటి వీడియో అప్పట్లో సోషల్మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన ధోనీ కూడా మస్త్ ఖుషీ అయ్యాడు. అంతేకాదు గోపి కృష్ణన్ కుటుంబాన్ని అభినందిస్తూ ఒక వీడియో విడుదల చేశౄడు. సీఎస్కేకు మద్దతుగా ఇంటిని పసుపు రంగులో మార్చేయడం నిజంగా గొప్ప విషయం. కృష్ణన్, అతడి కుటుంబసభ్యలకు ప్రత్యేక ధన్యవాదాలు అని ధోనీ తెలిపాడు.