Loksabha Elections 2024 : కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా (Sam Pitroda) తాజా వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వారసత్వ పన్ను గురించి కామెంట్ చేసి వివాదంలో ఇరుక్కున్న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ దేశ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతంలో ఉన్న వాళ్లు ఆఫ్రికన్లుగా, తూర్పున ఉన్నవాళ్లు చైనీయులుగా, పశ్చిమంలో ఉన్నవాళ్లు ఆరబ్బులుగా కనిపిస్తున్నారని పిట్రోడా వ్యాఖ్యానించారు.
సామ్ పిట్రోడా వ్యాఖ్యలపై శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది స్పందించారు. సామ్ ప్రకటనతో తాను అంగీకరించనని అయితే ఆయనేమైనా కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినరా అని ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. సామ్ పిట్రోడా కనీసం దేశంలో నివసిస్తున్నారా అని అడిగారు. ఆయన విదేశాల్లో ఉంటారని చెప్పారు.
ఆయన ప్రకటనలు దేశంలో అంశాలుగా మలచడం దురదృష్టకరమని అన్నారు. ఓవైపు దేశ ప్రజల సమస్యలు, వారికి సంబంధించిన అంశాలుంటే మరోవైపు అమెరికా నుంచి సాం పిట్రోడా ఏం మాట్లాడుతున్నారని ఆమె పేర్కొన్నారు. సాం పిట్రోడా వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వాటితో తమకేం సంబంధమని ప్రియాంక చతుర్వేది అన్నారు. పిట్రోడా వ్యాఖ్యలపై దేశం స్పందించాలని కోరుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు.
Read More :
AstraZeneca: మార్కెట్ల నుంచి కోవిడ్ టీకాను వెనక్కి రప్పిస్తున్న ఆస్ట్రాజెనికా