Mitchell Marsh : ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ(World Cup Trophy) పట్ల అవమానకరంగా ప్రవర్తించాడు. ట్రోఫీ బహూకరణ అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో మార్ష్ సోఫాలో కూర్చొని ప్రపంచ కప్ ట్రోఫీపై కాళ్లు ఆనించాడు. దాంతో, అతడిపై సోషల్మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘మార్ష్ నీకిది తగునా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘దయచేసి ట్రోఫీకి కాసింత మర్యాద ఇవ్వండి’, ‘ఏరకంగా చూసినా ఇది తప్పే’ అని పలువురు కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో ‘ఆస్ట్రేలియన్లకు ఇది ఏమంత సిగ్గు చేటు కాదు’ అని అంటున్నారు.
Mitchell Marsh with the World Cup. pic.twitter.com/n2oViCDgna
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 20, 2023
అహ్మాదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ తడబడింది. టాస్ ఓడిన భారత్ను శుభ్మన్ గిల్(4) వికెట్ తీసి మిచెల్ స్టార్క్ దెబ్బకొట్టాడు. కేఎల్ రాహుల్(66), విరాట్ కోహ్లీ(56), రోహిత్ శర్మ(47) రాణించడంతో భారత్ 240 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(137) శతకంతో చెలరేగాడు. బుమ్రా, షమీ, సిరాజ్ బౌలింగ్లో భారీ బౌండరీలో బాదిన హెడ్ భారత్ను ఒత్తిడిలోకి నెట్టాడు.
డేవిడ్ వార్నర్(7), మిచెల్ మార్ష్(15), స్టీవ్ స్మిత్(4) ఔటైనా.. పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో నిలబడ్డ హెడ్ కేవలం 120 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 137 పరుగులు చేయడం విశేషం. మార్నస్ లబూషేన్(58)తో కలిసి నాలుగో వికెట్కు 192 పరుగులు జోడించి ఆసీస్ను గెలుపు వాకిట నిలిపాడు. దాంతో, సొంతగడ్డపై రెండోసారి ప్రపంచ కప్ను ముద్దాడాలన్న భారత జట్టకు కల కలగానే మిగిలింది.