Travis Head : ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్(Travis Head) టీమిండియా పాలిట విలన్గా మారాడు. ఐసీసీ ఫైనల్స్(ICC Finals)లో భారత జట్టుపై పగబట్టినట్టు విరుచుకుపడుతున్నాడు. నాలుగు నెలల క్రితం ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final 2023) రోహిత్ సేనపై శతకంతో చెలరేగిన హెడ్.. తాజాగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో(ODI World Cup Final)నూ సూపర్ సెంచరీతో మ్యాచ్ను లాగేసుకున్నాడు.
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(56), రోహిత్ శర్మ(47) భారీ స్కోర్ చేయలేకపోయిన చోట ఈ లెఫ్ట్హ్యాండర్ సెంచరీ(137)తో కదం తొక్కాడు. బుమ్రా, షమీ, సిరాజ్ బౌలింగ్లో భారీ బౌండరీలో బాదిన హెడ్ భారత్ను ఒత్తిడిలోకి నెట్టాడు. డేవిడ్ వార్నర్(7), మిచెల్ మార్ష్(15), స్టీవ్ స్మిత్(4) ఔటైనా.. పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో నిలబడ్డ హెడ్.. 120 బంతుల్లోనే 15 ఫోర్లు, 4
ట్రావిస్ హెడ్ (137)
సిక్సర్లతో 137 పరుగులు చేయడం విశేషం. మార్నస్ లబూషేన్తో కలిసి హెడ్ నాలుగో వికెట్కు 192 పరుగులు జోడించి ఆసీస్ను గెలుపు వాకిట నిలిపాడు. దాంతో, సొంతగడ్డపై రెండోసారి ప్రపంచ కప్ను ముద్దాడాలన్న భారత జట్టకు కల కలగానే మిగిలింది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీతో కదం తొక్కిన హెడ్ (163)
ఇంగ్లండ్ వేదికగా జూన్లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కంగారూ జట్టు భారత్ను కంగారెత్తించింది. తొలి ఇన్నింగ్స్లో హెడ్ (163) విధ్వంసక శతకంతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో, ఆసీస్ 469 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 234కే ఆలౌట్ కావడంతో.. ఆసీస్ 209 పరుగుల తేడాతో గెలుపొంది టెస్టు గదను దక్కించుకుంది. తద్వారా అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది.
అహ్మాదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ తడబడింది. ఆసీస్ పేసర్ల విజృంభణతో 240 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో ఆదిలోనే మూడు కీలక వికెట్లు తీసినప్పటికీ ట్రావిస్ హెడ్(137), మార్నస్ లబూషేన్(58 నాటౌట్) గోడలా నిలబడ్డారు. దాంతో, 7 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆసీస్ ఆరోసారి ప్రపంచ కప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది.