టోక్యో: ఒలింపిక్స్ మూడో రోజు కూడా ఆర్చర్లు నిరాశ పరిచారు. ఇండియన్ మెన్స్ టీమ్ క్వార్టర్ఫైనల్లో ఓడిపోయింది. సౌత్ కొరియాతో జరిగిన ఈ గేమ్లో భారత పురుషుల జట్టు 0-6తో పరాజయం పాలైంది. తొలి సెట్ నుంచే కొరియన్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్దీప్ రాయ్లతో కూడిన టీమ్.. తొలి సెట్లో 54, రెండో సెట్లో 57, మూడో సెట్లో 54 స్కోర్ చేసింది. మరోవైపు కొరియన్లు తొలి సెట్లో 59, రెండో సెట్లో 59, మూడో సెట్లో 56 స్కోరు చేశారు. దీంతో మొత్తం ఆరు పాయింట్లూ సౌత్ కొరియా టీమ్ ఖాతాలోకి వెళ్లాయి.