WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) అద్భుతం చేసింది. వరుస ఓటములు ఎదురైనా సమిష్టి ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. ఎలిమినేటర్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను ఓడించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఆర్సీబీ ఫైనల్ చేరడంలో ఎలీస్ పెర్రీ(Ellyse Perry) పాత్ర మరువలేనిది. ముంబైపై అర్ధ సెంచరీతో చెలరేగిన పెర్రీ.. అనంతరం బంతితోనూ రాణించింది.
ప్లే ఆఫ్స్ ముందు యూపీ వారియర్స్పై చిన్నస్వామి స్టేడియంలో ‘గ్లాస్ బ్రేకింగ్’ ఇన్నింగ్స్ ఆడిన పెర్రీ.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో మరోసారి తన బ్యాట్ పవర్ చూపించింది. ముంబై బౌలర్లు ఉతికారేస్తూ జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించింది. ఇంతకు ఈ ఆస్ట్రేలియన్కు ఇష్టమైన భారతీయ పానీయం ఏంటో తెలుసా.? మసాలా చాయ్(Masala Chai).
Not a game for the faint hearted 😮💨#PlayBold #SheIsBold #ನಮ್ಮRCB #WPL2024 #MIvRCB
— Royal Challengers Bangalore (@RCBTweets) March 15, 2024
అవును.. పెర్రీ రోజుకు 12 కప్పుల మసాలా టీ తాగేస్తుందట. ఈ విషయాన్ని ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధానా ఇదివరకే వెల్లడించింది. దాంతో, ‘మసాలా టీ తాగి.. ముంబైని మటాష్’ చేసిన పెర్రీపై అభిమానులు ప్రశంసలు కురుస్తున్నారు. చిన్నస్వామి స్టేడియంలో యూపీపై అద్భుత విజయం తర్వాత మంధాన, పెర్రీలు బయటకు వెళ్లి.. మసాలా చాయ్ తాగొచ్చారు. ఇంతకుముందు కూడా వీళ్లిద్దరూ టీ తాగుతున్న ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
The obsession with Masala Chai ☕️
Enjoying batting in tandem 🤝
That window-smashing SIX 💥Signing off from Chinnaswamy with Captain Smriti Mandhana & Ellyse Perry 👌👌 – By @RajalArora
Full Interview 🎥🔽 #TATAWPL | #UPWvRCBhttps://t.co/flj9RvzB2J pic.twitter.com/3dvGZ43E35
— Women’s Premier League (WPL) (@wplt20) March 5, 2024
డబ్ల్యూపీఎల్ ఎలిమినేటర్లో ఆర్సీబీ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొని ముంబైని ఇంటికి పంపింది. ముంబై బౌలర్ల జోరుతో ఒకదశలో 49 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ 135 రన్స్ చేసిందంటే అదంతా పెర్రీ చలవే. కష్ట సమయంలో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన పెర్రీ 50 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్తో 66 పరుగులు బాదింది.
Mini Milestone: The GOAT crosses 500-run mark in this year’s WPL and takes the Orange Cap 🫡
Here is hoping she does it again with the ball tonight🤞#PlayBold #SheIsBold #ನಮ್ಮRCB #WPL2024 #MIvRCB @EllysePerry pic.twitter.com/yfjdxSZkPK
— Royal Challengers Bangalore (@RCBTweets) March 15, 2024
రీచా ఘోష్(14), వరేహమ్(18 నాటౌట్)లతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది.అనంతరం ఆల్రౌండర్ శ్రేయాంక పాటిల్ సూపర్ స్పెల్తో ముంబై 130కే పరిమితమైంది. దాంతో, ఆర్సీబీ తొలిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. మార్చి 17 ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో టైటిల్ పోరులో మంధాన సేన తలపడనుంది.