Manoj Tiwary : భారత జట్టు మాజీ ఆటగాడు, పశ్చిమ బెంగాల్ స్పోర్ట్స్ మినిస్టర్(West Bengal Sports Minister) మనోజ్ తివారీ(Manoj Tiwary) అంతర్జాతీయ క్రికెట్కు ఈరోజు వీడ్కోలు పలికాడు. ఎనిమిదేళ్లుగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేకపోయిన అతను ఈరోజు ఆట నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. ‘క్రికెట్కు గుడ్ బై. ఈ ఆట నాకు ఎన్నో ఇచ్చింది. నేను కలలో కూడా ఊహించనివి కూడా నాకు కట్టబెట్టింది.
నా జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించా. అయితే.. అన్ని వేళలో నాకు అండగా ఉన్న దేవుడికి, నాకు ఎంతో ఇచ్చిన క్రికెట్కు రుణపడి ఉంటా’ అని తివారీ ఇన్స్టాగ్రామ్లో వెల్లడించాడు. ఈ సందర్భంగా తివారీ హెల్మెట్ను ముద్దాడుతున్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి.. దానికి ‘థ్యాంక్యూ క్రికెట్’ అనే క్యాప్షన్ రాశాడు.
క్రికెట్కు వీడ్కోలు పలికన తివారీ తనకు ఎంతగానో సహకరించిన కోచ్, అమ్మానాన్నలను గుర్తు చేసుకున్నాడు. ‘మానబేంద్ర గోష్(Manabendra Ghosh).. కోచ్ మాత్రమే కాదు నాకు తండ్రితో సమానం. నా క్రికెటింగ్ జర్నీకి అతనే మూల స్తంభం. అతను గనుకు లేకుంటే నేను క్రికెట్లో ఈ స్థాయికి ఎదిగేవాడినే కాదు. ఇన్నేళ్లు నాకు మద్దతుగా ఉన్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు. ఎందుకంటే..? క్రికెట్పై నా ఇష్టాన్ని తెలుసుకున్న వాళ్లు ఎప్పుడు కూడా చదువుకోవాలని ఒత్తిడి చేయలేదు.
మనోజ్ తివారీ
అంతేకాదు నా భార్య రాయ్ సుష్మితకు కూడా థ్యాంక్యూ’ అని తివారో తన పోస్ట్లో రాసుకొచ్చాడు. క్రికెటర్గా రాణించిన తివారీ ఆ తర్వాత రాజకీయాల్లో కాలుమోపాడు. ఎన్నికల్లో గెలుపొంది ఏకంగా మంత్రిగా చాన్స్ కొట్టేశాడు. 37 ఏళ్ల తివారీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ స్పోర్ట్స్ మినిస్టర్(West Bengal Sports Minister)గా పనిచేస్తున్నాడు.
కుడిచేతి వాటం బ్యాటర్ అయిన మనోజ్ తివారీకి దేశవాళీ క్రికెట్(Domestic Cricket)లో తిరుగులేని రికార్డు ఉంది. 208-19లో విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లో 366 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతేకాదు అతను ఈమధ్యే రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. అద్భుతంగా రాణించిన అతను జట్టును ఫైనల్కు చేర్చాడు. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ తివారీ టీమిండియా తరఫున ఎక్కువ మ్యాచ్లు ఆడలేకపోయాడు. 2008లో అతను కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్లో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు.
మిడిలార్డర్లో గట్టి పోటీ ఉండడంతో కేవలం 12 వన్డేలు, 3 టీ20ల్లో మాత్రమే అతడికి అవకాశం వచ్చింది. ఆడింది 12 మ్యాచ్లే అయినా వన్డేల్లో సెంచరీతో మెరిశాడు. కానీ, ఆ తర్వాత అవకాశాలు దక్కలేదు. దాంతో, ఐపీఎల్పై దృష్టి పెట్టిన తివారీ ఢిల్లీ డేర్డెవిల్స్(Delhi Daredevils), కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), కింగ్స్ ఎలెవన్ పంజాబ్(Kings XI Punjab), రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్(Rising Pune Supergiants) ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. దృష్టిలో పడ్డాడు. పలు జట్లకు ఆడాడు.