MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)పై 10 ఏండ్ల క్రితం బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారికి జైలు శిక్ష పడింది. మద్రాస్ హైకోర్టు(Madra High Court) శుక్రవారం జి.సంపత్ కుమార్(G.Sampath Kumar) అనే ఆఫీసర్కు 15 రోజుల జైలు శిక్ష విధించింది.
ధోనీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసును ద్విసభ్య ధర్మాసనం విచారించింది. కేసు పూర్వాపరాలను నిశితంగా పరిశీలించిన జస్టిస్ ఎస్ ఎస్ సుందర్(Justice SS Sunder), జస్టిస్ సుందర్ మోహన్(Justice Sunder Mohan)లు సంపత్ కుమార్కు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాదు తమ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు సంపత్కు 30 రోజుల గడువు ఇచ్చారు.
Madras HC sentenced IPS officer Sampath Kumar to 15 days imprisonment in the contempt of court petition filed by Dhoni as the statements claimed he was involved in betting & fixing in 2013. [Bar & Bench]
Bench of Justices SS Sundar & Sunder Mohan suspended the sentence for 30… pic.twitter.com/2kp6R8Azqs
— Johns. (@CricCrazyJohns) December 15, 2023
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2013 ఎడిషన్లో స్పాట్ ఫిక్సింగ్కు, బెట్టింగ్ కేసు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ కేసును ఐపీఎస్ అధికారి అయిన జి. సంపత్ కుమార్ దర్యాప్తు చేశాడు. ఆ కేసుతో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ టీమ్ ప్రిన్సిపల్ మొయియప్పన్(Meiyappan)కు సంబంధం ఉండడంతో ధోనీకి కూడా బెట్టింగ్కు పాల్పడే ఉంటాడని సంపత్ తీవ్ర ఆరోపణలు చేశాడు. దాంతో, కోర్టును ఆశ్రయించిన ధోనీ అతడిపై కేసు ఫైల్ చేశాడు.
ఉద్దేశపూర్వకంగానే సంపత్ తనను ఇరికించాలని చూస్తున్నాడని మహీ రాతపూర్వకంగా రాసి ఇచ్చాడు. అప్పట్లో జీ మీడియా (Zee Media) కూడా బెట్టింగ్లో ధోనీ పాత్ర ఉందంటూ కథనాలు ప్రచురించింది. దాంతో, ఆ కేసును మద్రాస్ హై కోర్టు సవాల్గా తీసుకొంది. అప్పటికే టీమిండియాకు రెండు వరల్డ్ కప్లు అందించిన మహీకి బెట్టింగ్తో సంబంధం లేదని తేల్చి చెప్పింది. 2013లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ శ్రీశాంత్, అజిత్ చండీలాల్, అంకీత్ చవాన్లు బెట్టింగ్ పాల్పడిన విషయం తెలిసిందే.
INDvsSA Test: సఫారీతో టెస్టు సిరీస్లో భారత్కు షాక్ తప్పదా..? స్టార్ పేసర్ లేకుండానే…
Vijay Hazare Trophy | శతక్కొట్టిన దీపక్ హుడా.. ఫైనల్కు దూసుకెళ్లిన రాజస్థాన్
INDW vs ENGW | భారత ఆల్రౌండర్ మెరుపు ఫీల్డింగ్.. రనౌటైన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్.. వీడియో