Vijay Hazare Trophy : భారత జట్టులో చోటు కోల్పోయిన ఆల్రౌండర్ దీపక్ హుడా(Deepak Hooda) విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లో దంచికొడుతున్నాడు. రాజ్కోట్లో కర్నాటకతో జరిగిన మ్యాచ్లో రెండో సెమీఫైనల్లో విధ్వంసక సెంచరీ బాదాడు. వచ్చీ రావడంతోనే కర్నాటక బౌలర్లపై విరుచుకు పడిన అతడు.. 128 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 180 రన్స్ బాదాడు.
దాంతో 282 పరుగుల ఛేదనలో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్కు దూసుకెళ్లింది. టైటిల్ పోరులో రాజస్థాన్ శనివారం హర్యాణా(Haryana)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా చాంపియన్గా నిలవలేదు. దాంతో, తొలిసారి ట్రోఫీని ముద్దాడేది ఎవరు? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
దీపక్ హుడా(180)
రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గురువారం జరిగిన రెండో సెమీస్లో రాజస్థాన్, కర్నాటక తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కర్నాటకను అభినవ్ మనోహర్(91), మనోజ్ బందగే(63) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. దాంతో, 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో హుడా ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కరన్ లంబా(73)తో కలిసి కర్నాటక బౌలర్లపై విరుచుకు పడిన అతడు సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దాంతో, రాజస్థాన్ 43.4 ఓవర్లోలనే లక్ష్యాన్ని ఛేదించింది.