Mayank Yadav : ఐపీఎల్ 17వ సీజన్లో కొత్త తార పుట్టుకొచ్చాడు. పవర్ హిట్టర్లకు ముకుతాడు వేసే స్పీడ్గన్ల జాబితాలోకి కొత్త కుర్రాడు దూసుకొచ్చాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో వేగవంతమైన బంతి విసిరిన మయాంక్ యాద(Mayank Yadav) గురించే దేశమంతా మాట్లాడుకుంటోంది. మెగా టోర్నీలో మయాంక్ గంటకు 155.8 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. దాంతో, ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన బౌలర్గా 21 ఏండ్ల మయాంక్ చరిత్ర సృష్టించాడు.
దాంతో అందరూ అతడిని ‘ఢిల్లీ ఎక్స్ప్రెస్’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఇక మయాంక్ విషయానొకిస్తే.. అతడిది ఢిల్లీ. దేశవాళీలో ఢిల్లీ జట్టుతరఫున నిలకడగా రాణిస్తున్నాడు. వేగంగా బౌలింగ్ చేయడమే కాదు రయ్మంటూ దూసుకెళ్లే విమానాలు, స్పోర్ట్స్ బైక్లన్నా మనోడే మోజు. అందుకే తన సంచలన బౌలింగ్తో మయాంక్ తొలి మ్యాచ్తోనే వార్తల్లో నిలిచాడు.
𝗦𝗽𝗲𝗲𝗱𝗼𝗺𝗲𝘁𝗲𝗿 goes 🔥
𝟭𝟱𝟱.𝟴 𝗸𝗺𝘀/𝗵𝗿 by Mayank Yadav 🥵
Relishing the raw and exciting pace of the debutant who now has 2️⃣ wickets to his name 🫡#PBKS require 71 from 36 delivers
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL |… pic.twitter.com/rELovBTYMz
— IndianPremierLeague (@IPL) March 30, 2024
మయాంక్ ప్రతిభను గుర్తించిన లక్నో మేనేజ్మెంట్ 2022 వేలంలో రూ.20 లక్షలకే కొన్నది. ఇన్నాళ్లు నెట్స్లో లక్నో బ్యాటర్లకు పరీక్ష పెట్టిన ఈ యంగ్స్టర్ శనివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చాడు. వస్తూ వస్తూనే ధావన్ సేనపై మయాంక్ నిప్పులు చెరిగాడు. నాలుగు ఓవర్లలో కేవలం 27 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. జానీ బెయిర్స్టో(70), శిఖర్ ధావన్(42), జితేశ్ శర్మ(6)లను ఔట్ చేసిన లక్నోను పోటీలోకి తెచ్చాడు. అతడి ధాటికి పంజాబ్ 178 పరుగులకే పరిమితం కాగా.. లక్నో 21 పరుగులతో గెలుపొంది బోణీ కొట్టింది.