IND vs AUS : తొలి టీ20లో ఆస్ట్రేలియా 141 పరుగులకు ఆలౌటయ్యింది. యువకెరటం ఫొబే లిచ్ఫీల్డ్(49), అలీసా పెర్రీ(37) దంచికొట్టడంతో టీమిండియాకు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత పేసర్ టిటస్ సాధు(Titas Sadhu) చెలరేగడంతో ఆసీస్ 4 ప్రధాన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒకదశలో 33 రన్స్కే 4 వికెట్లు పడిన ఆసీస్ స్కోర్ 100 దాటడమే కష్టమనిపించింది.
కానీ.. వన్డే సిరీస్ ఫామ్ను కొనసాగిస్తూ లిచ్ఫీల్డ్, పెర్రీలు భారత బౌలర్లపై విరుచుకు పడ్డారు. యంగ్స్టర్ లిచ్ఫీల్డ్ అయితే.. దొరికిన బంతిని దొరికినట్టు బౌండ్రీకి పంపింది. 14.4వ ఓవర్లో ఆమెను ఔట్ చేయడంతో ఆసీస్ జోరుకు బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చినవాళ్లు డగౌట్కు క్యూ కట్టడంతో స్కోర్ వేగం మందగించింది. భారత బౌలర్లలో సాధు 4, దీప్తి శర్మ రెండు వికెట్లతో రాణించారు.
Phoebe Litchfield falls one short of a fourth straight fifty on this tour!
A fantastic innings after Australia’s jittery start 👏https://t.co/AgeTsoEpSj | #INDvAUS pic.twitter.com/PFWuLMXzmS
— ESPNcricinfo (@ESPNcricinfo) January 5, 2024
డీవై పాటిల్ స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. హేలీ()ని రేణుకా సింగ్ ఔట్ చేసిన కాసేపటకే.. సాధు విజృంభణతో బేత్ మూనీ(17), తహ్లియా మెక్గ్రాత్(0), అష్ గార్డ్నర్(0)లు పెవిలియన్ చేరారు. కష్టాల్లో పడ్డ జట్టును పెర్రీ, లిచ్ఫీల్డ్ ఆదుకున్నారు. వీళ్లిద్దరూ ఐదో వికెట్కు 79 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో, ఆసీస్ సవాల్ విసిరేంత లక్ష్యాన్ని నిర్దేశించింది.