All England Open : ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్షిప్లో భారత స్టార్ ఆటగాడు లక్ష్యసేన్(Lakshya sen) అదరగొడుతున్నాడు. తన అటాకింగ్ గేమ్తో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వస్తున్న అతడు సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. ఉత్కంఠగా సాగిన క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ లీ జీ జియా(Lee Zii Jia)ను ఓడించాడు. 18వ ర్యాంకర్ అయిన లక్ష్యసేన్ 20-21, 21-16, 21-19తో లీను మట్టికరిపించాడు.
తద్వారా సూపర్ 1000 టోర్నమెంట్లో ఈ భారత కెరటం రెండోసారి సెమీస్ చేరాడు. తద్వారా లక్ష్యసేన్ టైటిల్కు రెండడుగుల దూరంలో నిలిచాడు. ఒకవేళ అతడు ఫైనల్ చేరితే 23 ఏండ్ల తర్వాత భారత్కు పతకం అందించిన మూడో షట్లర్గా ఈ యంగ్స్టర్ చరిత్ర సృష్టిస్తాడు.
2️⃣nd semifinal at #AllEngland
2️⃣nd consecutive semifinal on #BWFWorldTourWell done Lakshya in that intense QF clash, keep going 😍🔥
📸: @badmintonphoto#AllEngland2024#IndiaontheRise#Badminton pic.twitter.com/iwebGvzSfS
— BAI Media (@BAI_Media) March 15, 2024
గత ఏడాదిలోనూ సంచలన విజయాలు సాధించిన లక్ష్యసేన కొత్త ఏడాది కూడా జోరు చూపిస్తున్నాడు. స్టార్ ఆటగాళ్లు వెనుదిరిగిన చోట త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించేందుకు రెడీగా ఉన్నాడు. తొలి సెట్ను 20-21తో కోల్పోయినా కంగారుపడకుండా గొప్పగా ఆడాడు.
వరుసగా రెండు సెట్లలో 2021లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్గా నిలిచిన లీని ఓడించాడు. ఈవిజయంతో భారత స్టార్ కొండంత ఆత్మవిశ్వాసం మూటగట్టుకున్నాడు. డబుల్స్లో టైటిల్ గెలుస్తారనుకున్న సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఇక మహిళల సింగిల్స్లో పీవీ సింధు సైతం నిరాశపరిచిన విషయం తెలిసిందే.