IND vs ENG 5th Test : భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) మరోసారి ఇంగ్లండ్ను దెబ్బకొట్టాడు. లంచ్కు ముందే రెండు వికెట్లతో స్టోక్స్ సేన నడ్డి విరిచిన ఈ చైనమాన్ బౌలర్ రెండో సెషన్లో ఓపెనర్ జాక్ క్రాలే(79) ఔట్ చేశాడు. కుల్దీప్ ఓవర్లో ఫ్రంట్ ఫుట్లో భారీ షాట్ ఆడాలనుకున్న క్రాలే బంతిని మిస్ అయి బౌల్డ్ అయ్యాడు. దాంతో, అసలేం జరిగింది అనుకుంటూ ఓ క్షణం క్రాలే బిత్తరపోయాడు. అలా.. భారత్పై నాలుగో హాఫ్ సెంచరీతో ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్(Matthew Hayden) రికార్డు సమం చేసిన క్రాలే నిరాశగా పెవిలియన్ చేరాడు.
కుల్దీప్ విజృంభణతో ఇంగ్లండ్ 143 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం వందో టెస్టు ఆడుతున్న జానీ బెయిర్స్టో(8), జో రూట్(19) పరుగులతో ఆడుతున్నారు. కష్టాల్లో పడిన జట్టును వీళ్లిద్దరూ కీలక భాగస్వామ్యంతో ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 40 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్.. 147/3.
జాక్ క్రాలే(79)
ఇంగ్లండ్కు బెన్ డకెట్(27), జాక్ క్రాలే(61 నాటౌట్)లు శుభారంభమిచ్చారు. ఆడపాదడపా బౌండరీలతో స్కోర్ బోర్డును 50 దాటించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీసేందుకు రోహిత్ స్పిన్నర్లను రంగంలోకి దింపాడు. ఊహించినట్టుగానే కుల్దీప్ తన తొలి ఓవర్లోనే డకెట్ను వెనక్కి పంపాడు. గాల్లోకి లేచిన ఆ బంతిని శుభ్మన్ గిల్ పరుగెత్తుతూ వెళ్లి డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు.
Catching game 🔛 point! ⚡️ ⚡️
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ShubmanGill | @IDFCFIRSTBank pic.twitter.com/DdHGPrTMVL
— BCCI (@BCCI) March 7, 2024
ఆ కాసేపటికే కుల్దీప్ ఉప్పల్ టెస్టు హీరో ఓలీ పోప్(11)ను ఔట్ చేశాడు. పోప్ ఫ్రంట్ ఫుట్ వచ్చి డిఫెన్స్ ఆడాలనుకోగా.. బంతి మిస్ అయింది. ధ్రువ్ జురెల్ రెప్పపాటులో స్టంపింగ్ చేయడంతో, 36 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 2 వికెట్ల నష్టానికి 100 పరుగులతో ఇంగ్లండ్ లంచ్కు వెళ్లింది.