Virat Kohli : భారతదేశం నలుమూలాలా ఈరోజు త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ‘బోలో స్వంతత్ర భారత్కీ జై’ నినాదాలతో దేశమంతా మార్మోగిపోయింది. బ్రిటీష్వాళ్లపై పోరాడిన వీరులను, మహనీయులను యావత్ ప్రజానీకం స్మరించుకుంది. 77వ జెండా పండుగ(Independence Day) సందర్భంగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కూడా కొన్ని జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు. అందరిలానే తనకు కూడా ఆగస్టు 15 చాలా ప్రత్యేకమని అన్నాడు.
‘మనదేశ చరిత్రలో ఆగస్టు 15 చాలా ముఖ్యమైన రోజు. ప్రతి ఏడాది ఈ రోజున దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని తాకుతాయి. నాకైతే స్వాతంత్య్ర దినోత్సవం చాలా ప్రత్యేకం. ఎందుకో తెలుసా..? ఆగస్టు 15న మానాన్న ప్రేమ్ కోహ్లీ(Prem Kohli) పుట్టినరోజు. అందుకని ప్రతి ఏడు ఇండిపెండెన్స్ డే, మా డాడీ బర్త్ డేని కలిపి చేసుకుంటాం’ అని కోహ్లీ వెల్లడించాడు. విరాట్ తండ్రి 2006లో గుండెపోటుతో మరణించాడు.
The reason behind #IndependenceDay being extra special to him, on and off the ground memories of this historic day and more – @imVkohli takes us through it all.#AsiaCupOnStar #Cricket #FollowTheBlues pic.twitter.com/3rzlCxsTow
— Star Sports (@StarSportsIndia) August 15, 2023
అంతేకాదు ఈ ప్రత్యేకమైన రోజుతో ఉన్న అనుబంధం గురించి కూడా విరాట్ మాట్లాడాడు. ‘ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు పతంగులు ఎగరేయడం ఆనవాయితీ. ఆరోజు ఎంతో సంబురంగా ఉండేంది. ఆగస్టు 14 లోపే మేము కైట్స్ ఎగరేయడానికి అవసరమైనవి అన్నీ తెచ్చుకునేవాళ్లం. 15వ తేదీన అందరం కలిసి పతంగులు ఎగరేసేవాళ్లం నాకు ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. 1947తో పోల్చితే ఇప్పుడు మనదేశం సాధించిన ప్రగతి, అభివృద్ధిని చూసి మనమంతా ఎంతో గర్విస్తున్నాం.
తండ్రితో చిన్నప్పటి విరాట్
కొన్నిసార్లు ఇండిపెండెన్స్ డేన మ్యాచ్లు ఆడాం. అప్పుడు మైదానంలోకి దిగి జాతీయ గీతం ఆలపించేవాళ్లం. జెండాలు పట్టుకొని పరుగెత్తెవాళ్లం’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. విరాట్ సారథ్యంలోని భారత జట్టు 2021 ఆగస్టు 16న ఇంగ్లండ్ను ఓడించింది. లార్డ్స్ టెస్టులో కోహ్లీ సేన విజయంతో టీమిండియా జెండా పండుగ సంతోషం రెట్టింపు అయింది.
విరాట్ కోహ్లీ
నిరుడు ఆసియా కప్(Asia Cup 2022)తో ఫామ్ అందుకున్న కోహ్లీ వరుస సెంచరీలతో దుమ్ము రేపుతున్నాడు. ఈమధ్యే వెస్టిండీస్పై రెండో టెస్టులో శతకంతో రికార్డు సృష్టించాడు. ఐదొందల అంతర్జాతీయ మ్యాచ్లో వంద కొట్టిన తొలి క్రికటెర్గా గుర్తింపు సాధించాడు. వన్డే, టీ20 సిరీస్కు దూరమైన విరాట్ మళ్లీ ఆసియా కప్తో జట్టుతో కలవనున్నాడు. వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు భారత జట్టు ఆడుతన్న చివరి టోర్నీ ఇది. దాంతో, ఈ టోర్నమెంట్లో సత్తా చాటాలని కోహ్లీతో పాటు అందరూ ఉవ్విళ్లూరుతున్నారు. ఆక్టోబర్ 5న భారత గడ్డపై ప్రపంచ కప్ మొదలవ్వనుంది. 2011లో సొంత గడ్డపై చాంపియన్గా నిలిచిన భారత్ మరోసారి ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది.