మెల్బోర్న్: టీ20 వరల్డ్కప్లో ఇండియా సెమీస్లోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. ఆదివారం ఫైనల్లో పాకిస్థాన్, ఇంగ్లండ్ ఢీకొనున్నాయి. అయితే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ రేసులో విరాట్ కోహ్లీ ముందున్నాడు. టోర్నీలో అతను అత్యధికంగా 296 రన్స్ చేశాడు. సెమీస్లోనూ కోహ్లీ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
Nine incredible performers are in the running for the Player of the Tournament award 👏
Who is your pick? 👀
🗳 VOTE NOW to stand a chance to win signed merchandise ➡ https://t.co/ukquhKhWVF pic.twitter.com/23NSoOw8bN
— ICC (@ICC) November 11, 2022
ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ జాబితాలో కోహ్లీ తర్వాత సూర్యకుమార్ యాదవ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, సామ్ కర్రన్, జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, సికిందర్ రాజా, వసిందు హసరంగ ఉన్నారు. ఈ తొమ్మిది కోసం ఓటింగ్ జరుగుతోంది. ఎవరు ఆ అవార్డు గెలుచుకుంటారో చూడాల్సిందే.
A half-century in the semi-final sees Virat Kohli sit comfortably at the top of the list 📈
More #T20WorldCup stats 👉 https://t.co/7ObOpIfeXK pic.twitter.com/ThfISwY2sq
— ICC (@ICC) November 11, 2022
అత్యధిక రన్స్ స్కోర్ చేసిన జాబితాలో కోహ్లీ టాప్లో ఉన్నాడు. అతన్ని ఎవరూ చేరుకునే అవకాశం లేనట్లుగా ఉంది. టోర్నీలో కోహ్లీ 296 రన్స్ చేశాడు. ఇక తర్వాత అత్యధిక పరుగులు చేసినవారిలో దౌడ(242), సూర్య(239), మెండిస్(223), రాజా(219), నిస్సాంకా(214), హేల్స్(211), టకర్(204) ఉన్నారు.