బాయ్: పొట్టి ప్రపంచకప్లో దుమ్మురేపుతున్న రన్మెషీన్ విరాట్ కోహ్లీ అక్టోబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. మహిళల విభాగంలో జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ పోటీలో ఉన్నారు. టీ20 వరల్డ్ కప్లో రికార్డులు తిరగరాస్తున్న విరాట్ కోహ్లీ తొలిసారి ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు. కోహ్లీతోపాటు దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్, జింబాబ్వేకు చెందిన సికిందర్ రజా కూడా పోటీలో ఉన్నారు. ఆసియాకప్లో అత్యధిక పరుగులతో జెమీమా (217), అత్యధిక వికెట్లతో దీప్తి శర్మ(13) భారత జట్టు టైటిల్ సాధించడంలో సహకరించారు.