IND vs RSA : సెంచూరియన్లో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ(59) హాఫ్ సెంచరీ బాదాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏకాగ్రతతో ఆడిన విరాట్ బర్గర్ ఓవర్లో బౌండరీతో ఫిఫ్టీ సాధించాడు. కానీ, మరోవైపు వచ్చిన వాళ్లు వచ్చినట్టు పెవిలియన్కు క్యూ కడుతున్నారు. శార్థూల్ ఠాకూర్(2)ను రబాడ ఔట్ చేయడంతో ఏడు వికెట్లు కోల్పోయి భారత్ ఆలౌట్ ప్రమాదంలో పడింది. ప్రస్తుతం బుమ్రా క్రీజులో ఉన్నాడు. భారత్ ఇంకా 50 పరుగులు వెనకబడి ఉంది. ఇక మిగిలిన ముగ్గురితో కలిసి విరాట్ ఇన్నింగ్స్ ఓటమి తప్పిస్తాడా? లేదా? అనేది చూడాలి.
Thakur now falls to KG
India still trail by 58; with 3 wickets in hand, an innings defeat looms #SAvIND
Tune in ⤵️
— ESPNcricinfo (@ESPNcricinfo) December 28, 2023
ఆఖరి సెషన్లో దక్షిణాఫ్రికా పేసర్లు బౌన్సర్లతో హడలెత్తిస్తున్నారు. బౌలింగ్కు సహకరిస్తున్న పిచ్పై బర్గర్ రెచ్చిపోయాడు. వరుస బంతుల్లో సెంచరీ వీరుడు రాహుల్(4), అశ్విన్(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్పై నిలిచాడు. శ్రేయస్ అయ్యర్(6), ఠాకూర్(2)ను రబాడ ఔట్ చేసి రోహిత్ సేనను మరింత కష్టాల్లోకి నెట్టాడు. దాంతో, షఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న భారత జట్టు కల కలగానే మిగలనుంది.