Virat Kohli : టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ స్టార్ క్రికెటర్ ఎక్కడ కనిపించినా ‘సెల్ఫీ ప్లీజ్’ అంటూ అభిమానులు వెంటపడుతారు. తాజాగా ముంబై ఎయిర్పోర్టు(Mumbai Airport)లో ఒకతను విరాట్తో సెల్ఫీ దిగాలనుకున్నాడు. అందుకని కోహ్లీ దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. విరాట్ కూడా సెల్ఫీ దిగుదాం అనుకున్నాడు. కానీ, అప్పటికే సమయం అయిపోవడంతో సెక్యూరిటీ ఆ అభిమానిని వారించారు. దాంతో, ఒకింత నిరాశ చెందిన అతడికి ..’మళ్లీ కలిసినప్పుడు తప్పకుండా సెల్ఫీ దిగుతా’ అని కోహ్లీ ప్రామిస్ చేశాడు. అనంతరం కారెక్కి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)లో రెండో టెస్టులో కోహ్లీ సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. ఐదొందల అంతర్జాతీయ మ్యాచ్లో శతకం బాదిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. అయితే.. వన్డే సిరీస్లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంతో విరాట్ స్వదేశం వచ్చేశాడు.
Virat Kohli promises a fan for a selfie next time he travels. pic.twitter.com/hUrdYJPtqs
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 12, 2023
విరాట్ కోహ్లీ
ఈ నెలాఖరున మొదలవ్వనున్న ఆసియా కప్(Asia Cup 2023) కోసం అతను సన్నద్ధమవుతున్నాడు. నిరుడు ఇదే టోర్నీలో ఫామ్లోకి వచ్చిన ఈ స్టార్ ప్లేయర్ మళ్లీ పరుగుల వరద పారించాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో 102 రన్స్ చేస్తే కోహ్లీ వన్డేల్లో 13 వేల క్లబ్లో చేరతాడు. ఇప్పటివరకూ 265 వన్డేలు ఆడిన అతడి ఖాతాలో 12,898 పరుగులు ఉన్నాయి. కోహ్లీ కంటే ముందు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూర్కర్(Sachin Tendulkar) 13 వేల పరుగుల మైలురాయికి చేరువయ్యాడు. మాస్టర్ బ్లాస్టర్ 321 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించాడు.