డర్హం: టాపార్డర్ ఆకట్టుకోలేకపోయినా.. మిడిలార్డర్లో వికెట్కీపర్ బ్యాట్స్మన్ లోకేశ్ రాహుల్ (101), రవీంద్ర జడేజా (75) రాణించడంతో కౌంటీ సెలెక్ట్ ఎలెవన్తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ 9 వికెట్లకు 306 పరుగులు చేసింది. నాయక ద్వయం కోహ్లీ, రహానే ఈ మ్యాచ్కు దూరం కాగా.. భారత జట్టు రోహిత్ సారథ్యంలో బరిలోకి దిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. రోహిత్ (9), మయాంక్ (28), పుజారా (21), విహారి (24) ఎక్కువసేపు నిలువలేకపోయారు. ఈ దశలో రాహుల్, జడేజా ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ.. కౌంటీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. సెంచరీ అనంతరం రాహుల్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగగా.. కాసేపటికే జడేజా క్యాచ్ ఔటయ్యాడు. కౌంటీ జట్టుకు ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో భారత ప్లేయర్స్ అవేశ్ ఖాన్, సుందర్ ఆ జట్టు తరఫున బరిలో దిగారు.