ముంబై: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ .. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఇరగదీశాడు. గురువారం జరిగిన ఆ మ్యాచ్లో అతను 42 బంతుల్లో 98 రన్స్ చేశాడు. దీంతో పంజాబ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే రాహుల్ ఆడిన తీరుపై మాజీ క్రికెటర్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కన్నా ఎక్కువ సామర్థ్యం కేఎల్ రాహుల్ వద్ద ఉన్నట్లు అభిప్రాయపడ్డాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో రాహుల్ ఆడిన తీరు అద్భుతమని, ఇలా బ్యాటింగ్ చేస్తే దీన్ని బట్టి అతని ట్యాలెంట్ను అంచనా వేయవచ్చు అని, విరాట్, రోహిత్ కన్నా ఎక్కువ సత్తా అతనికి ఉందని, భారత జట్టు ఆటగాళ్లలో అందరి కన్నా ఎక్కువ రేంజ్లో రకరకాల షాట్లు ఆడే సత్తా రాహుల్కు ఉన్నట్లు గంభీర్ తెలిపాడు. ఆటను ఆస్వాదించాలని, భారతీయులకే కాదు, నీ సామర్థ్యాన్ని అందరికీ చూపించాలని, రోహిత్-కోహ్లీ గురించి జనం మాట్లాడుతుంటే, నీ గురించి కూడా వాళ్లు మాట్లాడుకునే ఛాన్సు ఉందని, ఎందుకంటే వారి కంటే నీవద్ద ఇంకా ఎక్కువ షాట్లు ఆడే సామర్థ్యం ఉన్నట్లు గంభీర్ తెలిపాడు. అయితే 12 పాయింట్లు సాధించిన పంజాబ్.. ప్లే ఆఫ్కు ఎంపిక కాలేకపోయింది.