న్యూఢిల్లీ: గాయాల నుంచి కోలుకున్న సీనియర్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్.. ఆసియాకప్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగైదు నెలలుగా ఆటకు దూరమైన ఈ ఇద్దరు శస్త్రచికిత్సల అనంతరం మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. ఆసియాకప్ ప్రారంభానికి ముందు ఈ నెల 23 నుంచి బెంగళూరులో జరుగనున్న శిబిరం తర్వాత వీరిద్దరి పరిస్థితిని గమనించి నిర్ణయం తీసుకోనున్నట్లు భారత కోచ్ ద్రవిడ్ పేర్కొన్నాడు.
‘కొంత మంది ప్లేయర్లు గాయాల నుంచి కోలుకొని తిరిగి రానున్నారు. వాళ్లకు అవకాశాలు ఇస్తాం. ఆసియాకప్ ప్రారంభానికి ముందు బెంగళూరులో క్యాంప్ నిర్వహిస్తాం’ అని ద్రవిడ్ చెప్పాడు. గాయం నుంచి కోలుకున్న బుమ్రా ఐర్లాండ్తో సిరీస్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.