ఓవల్ : భారత్తో జరుగుతున్న నాలుగవ టెస్టులో .. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. అయిదు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు 1-1 గెలుపుతో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్కు ఇంగ్లండ్ జట్టు రెండు మార్పులు చేసింది. జోస్ బట్లర్, సామ్ కుర్రన్ స్థానంలో ఒలీ పోప్, క్రిస్ వోక్స్ వచ్చారు. భారత జట్టులో కూడా రెండు మార్పులు జరిగాయి. ఇశాంత్ శర్మ, షమీ స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్లు జట్టులో చేరారు. నాలుగవ టెస్ట్ నుంచి బట్లర్ తప్పుకోవడంతో.. ఇంగ్లండ్ కీపింగ్ బాధ్యతలు బెయిర్స్ట్రో చేపట్టనున్నాడు. ఓవల్ టెస్టుకు కూడా రవిచంద్ర అశ్విన్ను తీసుకోలేదు. ప్రస్తుతం ఓవల్లో మేఘావృతం అయి ఉంది. బౌలింగ్కు అనుకూలించే పరిస్థితులు ఉన్నాయి. టాస్ గెలిస్తే తాను కూడా ముందు బౌలింగ్ ఎంచుకునేవాడినని కోహ్లీ అన్నాడు.