Jeffrey Boycott : తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో చావుదెబ్బతిన్న భారత జట్టు(Team India) కీలకమైన రెండో టెస్టు కోసం నెట్స్లో చెమటోడ్చుతోంది. వైజాగ్లో ఇంగ్లీష్ జట్టు బజ్బాల్(Buzz Ball)కు చెక్ పెట్టి సిరీస్ సమం చేయాలనే కసితో ఉంది. ఈ సమయంలో భారత సారథి రోహిత్ శర్మ(Rohit Sharma)పై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జెఫ్రీ బాయ్కాట్(Jeffrey Boycott) సంచలన కామెంట్స్ చేశాడు.
డెయిలీ టెలీగ్రాఫ్లో మాట్లాడిన బాయ్కాట్.. ‘కీలక ఆటగాళ్లైన కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలను భారత జట్టు మిస్ అవుతోంది. ఇక కెప్టెన్ రోహిత్ వయసైపోయింది. అతడికి ఇప్పుడు 37 ఏండ్లకు దగ్గరయ్యాడు. కెప్టెన్గా, ఆటగాడిగా అత్యుత్తమ దశ దాటేశాడు’ అని అన్నాడు.
అంతేకాదు స్టార్ ఆటగాళ్లు లేని భారత్ను ఓడించడం చాలా తేలికని బాయ్కాట్ తెలిపాడు. ‘టీమిండియా ఇప్పుడు బలహీనంగా ఉంది. 12 ఏండ్ల రికార్డును బ్రేక్ చేసేందుకు ఇంగ్లండ్కు ఇదే గోల్డెన్ చాన్స్’ అని బాయ్కాట్ వెల్లడించాడు. రోహిత్ ఉప్పల్ టెస్టులో దారుణంగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్లో 24, రెండో ఇన్నింగ్స్లో39 పరుగులకే పరిమితమయ్యాడు.
రోహిత్, కోహ్లీ
ఇక సొంత గడ్డపై 2012లో ఇంగ్లండ్ చేతిలో 2-1తో టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్.. ఆ తర్వాత అన్నింటా జయకేతనం ఎగురవేసింది. కోహ్లీ సారథ్యంలో అగ్రశ్రేణి జట్లకు షాకిచ్చి ఏకంగా వరల్డ్ నంబర్ 1 ర్యాంక్కు ఎగబాకింది. ఉప్పల్ టెస్టు ఓటమితో ఇప్పుడు డబ్ల్యూటీసీ(WTC 2023-25) ర్యాంకింగ్స్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది.
షోయబ్ బషీర్
విశాఖపట్టణంలో శుక్రవారం జరిగే టెస్టుకు బెన్ స్టోక్స్ సేన గట్టిగానే రెడీ అవుతోంది. స్పిన్ పిచ్ ఉంటుందనే వార్తల నేపథ్యంలో ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో ఆడనుంది. గురువారం ఇంగ్లండ్ తుదిజట్టును ప్రకటించింది. గాయపడిన స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో షోయబ్ బషీర్, మార్క్ వుడ్ బదులు వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ జట్టులోకి వచ్చారు.
ఇంగ్లండ్ తుది జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్లే, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.