England : భారత జట్టుతో రెండో టెస్టు కోసం ఇంగ్లండ్(England) జట్టు ప్రాక్టీస్ వేగం పెంచింది. ఇప్పటికే విశాఖపట్టణంలో చేరుకున్న బెన్ స్టోక్స్(Ben Stokes) సేన శుక్రవారం జరిగే టెస్టు కోసం తుది జట్టును ప్రకటించింది. ఐదు టెస్టుల సిరీస్లో1-0తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్ ఈ టెస్టులో రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. గాయపడిన స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్(Jack Leach) స్థానంలో షోయబ్ బషీర్(Shoaib Bashir) ఎంపికయ్యాడు. దాంతో, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదరగొట్టిన ఈ కుర్రాడు వైజాగ్ టెస్టులో అరంగేట్రం చేయడం ఖాయమైంది.
మార్క్ వుడ్ ప్లేస్లో వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్(James Anderson) జట్టులోకి వచ్చాడు. ఫస్ట్ క్లాస్లో బషీర్ ఆడింది ఆరు మ్యాచులే అయినా 3.30 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. వాస్తవానికి తొలి టెస్టులోనే అతడు ఆడాల్సింది. కానీ, పాకిస్థాన్ మూలాల నేపథ్యంలో వీసా(Visa) ఆలస్యం కారణంగా అబూదాబీలోనే చిక్కుకొనిపోయాడు. బీసీసీఐ జోక్యం చేసుకోవడంతో అతడికి వీసా మంజూరైంది.
We have named our XI for the second Test in Vizag! 🏏
🇮🇳 #INDvENG 🏴 | #EnglandCricket
— England Cricket (@englandcricket) February 1, 2024
ఇంగ్లండ్ తుది జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్లే, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.
స్వింగ్, రివర్స్ సింగ్కు పెట్టింది పేరైన అండర్సన్ 700 వికెట్ల మైలురాయికి దగ్గర్లో ఉన్నాడు. ఒకవేళ వైజాగ్ టెస్టులో అతడు 10 వికెట్లు తీస్తే.. లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్(Muttaiah Muralidharan), దివంగత ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్(Shane Warne)ల తర్వాత 700 వికెట్లు తీసిన మూడో బౌలర్గా చరిత్ర సృష్టిస్తాడు.
జేమ్స్ అండర్సన్
ఉప్పల్ టెస్టులో తొలి రెండు రోజులు అసలు పోటీలోనే లేని ఇంగ్లండ్ సంచలన విజయం నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్లో బెన్ స్టోక్స్(70) ఒక్కడే పోరాడగాఆ.. రెండో ఇన్నింగ్స్లో ఓలీ పోప్(196) వీరోచిత శతకంతో విరుచుకుపడ్డాడు. స్వీప్, రివర్స్స్వీప్ షాట్లే ఆయుధంగా భారత స్పిన్ ద్యయం జడేజా, అశ్విన్ల లయను దెబ్బకొట్టాడు.
ఓలీ పోప్(196)
టెయిలెండర్లతో కలిసి జట్టుకు 420 పరుగుల భారీ స్కోర్ అందించాడు. ఆ తర్వాత అరంగేట్రం స్పిన్నర్ టామ్ హర్ట్లే తిప్పేశాడు. అతడు ఏడు వికెట్లు తీయడంతో భారత జట్టు 28 పరుగుల తేడాతో మ్యాచ్ చేజార్చుకుంది. వైజాగ్లోనూ బషీర్, హర్ట్లే, రెహాన్ అహ్మద్ త్రయం టీమిండియా బ్యాటర్లను ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.